అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో వెనుకడుగు వేసింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని చాలా రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా పరీక్షల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. […]