కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎగువ అహోబిలంలో పావన నరసింహస్వామి ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది. మెట్ల మార్గంలో కాపు కాసిన చిరుత ఒక్కసారిగా భక్తుడిపైకి దూకి దాడి చేసింది. వెంటనే తేరుకున్న భక్తుడు మెట్ల పై నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ విషయం తెలిసిన భక్తులు మెట్లమార్గం గుండా వెళ్లేందుకు భయపడుతున్నారు. వారం రోజులుగా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారిస్తుండడంతో భక్తులు […]
ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఎక్కువగా గ్రామాలు, పట్టణాల్లోకి చిరుతలు ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని సార్లు ఇవి మనుషులు, కుక్కులపై దాడులు చేస్తున్నాయి. ఈ మద్య ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిరుత పులుల సంచారంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ చిరుత పులులపై నిఘా పెడుతూనే ఉన్నారు. కర్నూలు జిల్లాలోని అళ్లగడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచరించింది. ఆలయంలోనే […]