ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఎక్కువగా గ్రామాలు, పట్టణాల్లోకి చిరుతలు ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని సార్లు ఇవి మనుషులు, కుక్కులపై దాడులు చేస్తున్నాయి. ఈ మద్య ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిరుత పులుల సంచారంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ చిరుత పులులపై నిఘా పెడుతూనే ఉన్నారు.
కర్నూలు జిల్లాలోని అళ్లగడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచరించింది. ఆలయంలోనే వెనుకవైపు ఉన్న ధ్వజస్థంబం నుంచి లోపలికి వచ్చిన చిరుత రామానుజాచార్యుల మండపం వద్ద ఉన్నకుక్కపిల్లలను లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. అక్కడ ఉన్న కుక్కలు అరవడంతో బెదిరిపోయిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఆలయంలోని రామానుజాచార్యుల మండపం వద్ద కుక్కపిల్లలు ఉన్నాయని ఆ చిరుత ఎలా పసిగట్టిందని ఆలయ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.
ఇది చదవండి : పండగపూట ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ
ఇక కుక్కలన్నీ ఒక్కసారే ఎగబడటంతో చిన్న కుక్కపిల్లలు బతికి బయటపడ్డాయని ఆలయాధికారులు అనుకుంటున్నారు. ఆలయంలోకి చిరుత ప్రవేశించినట్టు తెలుసుకున్న భక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు బిక్కుబిక్కుమంటూ దర్శనం చేసుకున్నారు. ఆలయం చుట్టు గట్టి నిఘా పెట్టి ఉంచుతామని ఆలయ అధికారులు అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A leopard entering Upper #Ahobilam temple in #Kurnool district to hunt a puppy was caught on CCTV camera. The incident happened on Jan 7 @NewIndianXpress pic.twitter.com/99uBWR9JUo
— TNIE Andhra Pradesh (@xpressandhra) January 9, 2022