ఈ ఏడాది వేసవికాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీగా కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలకు కడగళ్లు మిగిలాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 10వేలు జమచేస్తున్నారు.