గుంటూరు జిల్లా సంగం డెయిరీ వ్యవహారంలో హైకోర్టు జగన్ సర్కార్కు షాకిచ్చింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని డైరెక్టర్స్ తమ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 19కి వ్యతిరేకంగా డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని […]
హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించేందుకు అర్హతలేదని, అందుకు తగిన ఆధారాలు కూడా లేవని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు నుంచి చంద్రబాబుకు ఊరట లభించింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన […]