ఇటీవల కాలంలో నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదంలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కొల్పోతున్నారు. పొట్టకూటి కోసం వచ్చి ఇలా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో బిల్డింగ్ కూలిన ప్రమాదం చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో ఆ భవనం శిథిలాల కింద ఐదుగురు కార్మికులు చిక్కున్నట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీల సాయంతో శిథిలాను తొలగిస్తున్నారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.