ఆడవారు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నారు. వాళ్ళు ఎంత అభివృద్ది చెందుతున్నా.. వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాగే హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న సూర్యోదయనగర్లో వరకట్న వేధింపులకు ఓ యువతి బలైంది. ఆ వివరాల్లోకి వెళితే.. డాక్టర్ వంగ భారతిది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్. ఈమె వయసు (31). రమేష్తో ఆమెకు గతేడాది వివాహం జరిగింది. ఎకరం పొలం, రూ.5 […]