కోల్ కత్తా (నేషనల్ డెస్క్)- పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో టీఎంసీతో తో నువ్వా నేనా అన్న విధంగా పోటీపడిన బీజేపీ చతికిలపడిపోయింది. మొత్తం 292 స్థానాలకు గాను 213 స్థానాల్లో టీఎంసీ విజయకేతనం ఎగుర వేసింది. మరోవైపు దీదీని ఈ సారి ఎలాగైనా దెబ్బకొట్టి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంలో సర్వశక్తులూ ఒడ్డిన బీజేపీ కేవలం 75 స్థానాలు గెలుపొందగా, మరో రెండుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. […]