తెలంగాణ పల్లెకు అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిని ప్రపంచంలోనే బెస్ట్ టూరిజం విలేజ్స్లో ఒకటిగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్జనైజేషన్ గుర్తించింది. డిసెంబర్ 2న యుఎన్డబ్ల్యుటీఓ 24వ సెషన్లో బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డును అందించనున్నారు. ఈ కార్యక్రమం స్పెయిన్ దేశంలో జరగనుంది. కాగా తెలంగాణ రాష్ట్రానికి ఈ అవార్డు దక్కడం నిజంగా గొప్ప విషయం. కాగా దేశవ్యాప్తంగా మూడు గ్రామాలు ఈ అవార్డు కోసం దేశం తరపున నామినేట్ కాగా […]