హైదరాబాద్ లోని నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీ నివేదికను పరిశీలించిన తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.