ముంబయి- ఓ వైపు కరోనా, మరో వైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా ఇప్పటికే భీబత్సం సృష్టిస్తోంటే.. అది చాలదన్నట్లు తౌక్టే సైక్లోన్ ధూసుకొచ్చింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫానుకు మహారాష్ట్ర, గుజరాత్ సహా ఐదు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. ఈ తుఫాను ప్రస్తుతం గుజరాత్ తీరం వైపు పయనిస్తోంది. మంగళవారం సాయంత్రం ఇది గుజరాత్ పోరుబందర్ మహూవా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. […]