కలియుగ వైకుంఠంగా, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమలలో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. వడ్డీకాసులవాడి సమక్షంలో ఓ బిచ్చగాడు లక్షాధికారి అయిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీవారి ఆలయన్ని, అక్కడికి వచ్చే భక్తులను నమ్ముకుని కొన్ని వందల మంది అనాథలు, బిచ్చగాళ్లు తిరుమలలో కాలం వెళ్లదీస్తున్నక్రమంలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.10లక్షలు దొరకడం స్థానికంగా సంచలనం రేపింది. నా అన్న వాళ్లెవరూ లేని అనాథ. అతని గది తెరచి చూస్తే రెండు ట్రంకు పెట్టెలు, […]