హైదరాబాద్- తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసిన సజ్జనార్, ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమైందని చెప్పేందుకు ఆయనే స్వయంగా ఆర్టీసీలో ప్రయాణించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు స్లోగన్స్ వరకే పరిమితం అయిన ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం అనే నినాదాన్ని […]