గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలేవైనా కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. ఇదే అదునుగా కొంత మంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి రెండు ముఠాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఈ ముఠాను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కూడా […]