తిరుపతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీ వానలు పడుతున్నాయి. తిరుపతిలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక భారీ వర్షాలకు శ్రీవారి సన్నిది తిరుమల అతలాకుతలం […]