ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన పీఆర్సీ ఉద్యమం తారాస్థాయికి చేరింది. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నిర్బంధాలను దాటుకుని సుమారు 50 వేల మంది ఉద్యోగులు విజయవాడ వచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం […]