ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఏపిలోని అనంత రాజకీయాల్లో పరిటాల కుటుంబానికి ప్రత్యేక పేరు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం అధికారంలో ఉన్న సమయంలో పరిటాల సతీమణి పరిటాల సునిత మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా […]