న్యూ ఢిల్లీ- భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (88) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. జ్వరం, ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన మన్మోహన్ సింగ్ కు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరంతో పాటు నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం మన్మోహన్ సింగ్ కు చికిత్స అందిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ […]