లోన్లు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా, చట్టానికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్న వారిని పట్టుకోవడం కోసం క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి 'సెబీ' కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసెట్ డిఫాల్టర్ల సమాచారం తెలిపిన వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు 515 మంది ఎగవేతదార్ల జాబితాను విడుదల చేసింది. వీరికి సంబంధించిన సమాచారాన్నే మీరు తెలియజేయాలి.