హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించేందుకు అర్హతలేదని, అందుకు తగిన ఆధారాలు కూడా లేవని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు నుంచి చంద్రబాబుకు ఊరట లభించింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన […]