సరిహద్దు వెంట భారత్ – చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. దుష్ట చైనా తన దుస్తంత్రాన్ని మళ్లీ ప్రయోగించింది. డోక్లాం, గాల్వన్ ప్రాంతాల్లో ఘర్షణల తర్వాత ఇప్పుడు మరోసారి అరుణాచల్ ప్రదేశ్ లోని తవంగ్ ప్రాంతంలో భారత సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘటన ఈ నెల 9న జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడినట్లు సమాచారం. ఎల్ఏసీకి సమీపంలోకి చైనా సైనికులు వచ్చినప్పుడు ఈ ఘర్షణ జరిగినట్లుగా ఆర్మీ […]