నిర్మల్ జిల్లా జిల్లా బాసర ట్రిపుల్ఐటీలో ఫుడ్ ఫాయిజన్ కలకలం రేపింది. సుమారు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఓల్డ్ మెస్ లో మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటికే సుమారు 600 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ట్రిపుల్ఐటీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీరియస్ గా ఉన్న విద్యార్థులను నిజమాబాద్ కు తరలిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి ఎగ్ ఫ్రైడ్ రైస్ కారణమని […]