హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చెక్ చేయడానికి వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ అమిరేశ్(51) ప్రమాదవశాత్తు వేదిక ముందున్న మెయింటెనెన్స్ ఏరియాలో పడి మృతి చెందారు. అధికారులకు నివేదిక ఇవ్వడం కోసం స్టేజీపై ఫొటోలు తీస్తూ గుంతలో పడిపోవడంతో.. తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ శిల్పకళా వేదికలో […]