రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలిచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అప్పుడు టీకా తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కొవిన్లో రిజిస్టర్ చేసుకోకపోయినా, కేంద్రాలకు నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సెకండ్ వేవ్ తీవ్రతతో వ్యాక్సిన్ల కోసం ప్రజలు బారులు తీరడంతో ప్రస్తుతం టీకాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. దీంతో రిజిస్టర్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇస్తామని వైద్యశాఖ […]