నెల్లూరు జిల్లా బంగారు, రాగి నిల్వలు ఉన్నట్లు జియోలాజికగల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఉదయగిరి మండలం మాసాయి పేటలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారంతో పాటు రాగి నిల్వలు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక్కడి పరిసరాల్లోని ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సేకరించారు. మాసాయి పేట పరిసర ప్రాంతాల్లో 2వేల హెక్టార్లకు పైగా నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో […]