భవిష్యత్పురాణంలో ప్రస్తావన. ఈ వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది. నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ. 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. గరుడపంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం […]