గౌరవమైన స్థానంలో ఉంటూ కొన్ని సార్లు ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అది కాస్త సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర అసెంబ్లీలో మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం అసెంబ్లీ సమావేశంలో రైతు సమ్యలపై చర్చను పొడిగించాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారు. వారిని అదుపు చేయడం స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే కగేరీకి తలకు మించిన భారంలా అనిపించింది. నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నింటినీ […]