చెన్నై- తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వివాదం ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. న్యాయపోరాటం తరువాత ఎట్టకేలకు జయలలిత ఇంటి తాళాలు ఆమె అన్న కూతురు, కుమారుడు దీప, దీపక్ చేతికి వచ్చాయి. ఈ మేరకు దీప శుక్రవారం గృహ ప్రవేశం చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 డిసెంబర్ 5న ఆకస్మిక మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదాలకు దారితీసింది. […]