కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ రెండింటిలో ఏ వ్యాక్సిన్ను తీసుకున్నా శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే లక్నోలో ఓ వ్యక్తి కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై ప్రతాప్ చంద్ర ఫిర్యాదు చేశాడు. తాను కోవిషీల్డ్ డోసును తీసుకున్నప్పటికీ తనలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదని తెలిపాడు. సీరమ్ సంస్థతోపాటు మరికొందరిపై అతను ఫిర్యాదు చేశాడు. లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సీరమ్ సంస్థతోపాటు డీసీజీఏ డైరెక్టర్, […]