హైదరాబాద్- దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి అందుపులోనే ఉందని ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఐనప్పటికీ రాబోయే రెండు వారాలు చాలా కీలకమని చెప్పారు. కరోనా కట్టడిపై మంత్రి కేటీఆర్ సారథ్యంలోని టాస్క్ఫోర్స్ కమిటీ బుధవారం మొదటిసారిగా సమావేశమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో పూర్తి స్థాయి బెడ్లు, ఆక్సిజన్, రెమిడేసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే ఉన్నాయని ఈ సందర్బంగా కేటీఆర్ చెప్పారు. ప్రతి రోజూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాడే ఇక్సిజన్పై […]