సామాజిక, డిజిటల్ మాధ్యమాల్లోని కంటెంట్ను నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ పేరిట కొన్ని నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. వీటిని అమలు చేయడానికి కేంద్రం ఆయా సంస్థలకు మూడు నెలల గడువు ముగిసింది. కొత్త ఐటీ నియమ నిబంధనలు పాటించడానికి దిగ్గజ సామాజిక సంస్థలు ఫేస్బుక్, గూగుల్లు సూత్రపాయంగా అంగీకరించాయి. వీటి అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించాయి. ట్విట్టర్ నుంచి మాత్రం దీనిపై ఎటువంటి స్పందన లేదు. […]