గత నెల 22వ తేదీన చాంద్రాయణగుట్ట పోలీసులు పూరన్ సింగ్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే అదే నెల 25వ తేదీన సూరం చెరువులో డ్రమ్ములో శవం కనిపించగా.. విచారణ చేపట్టారు. విచారణలో అతడు బండ్ల గూడకు చెందిన పూరన్ సింగ్ అని గుర్తించారు. ఈ కేసును పోలీసులు చేధించారు.
హైదరాబాద్- మన దేశంలో దొంగ బాబాలకు కొదవే లేదు. బాబాల ముసుగులో కొంత మంది కేటుగాళ్లు జనాలను నిలువునా ముంచుతున్నారు. ఇంకొందరైతే బాబా వేశంలో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. దొంగ బాబాల రాసలీలల గురించి మనం ఇంతకు ముందు చాలా ఘటనలను చూశాం. ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ లో మరో దొంగ బాబా వ్యవహారం బయటపడింది. మంత్ర, తంత్రాల పేరుతో మాయమాటలు చెప్పి మహిళలను లొంగదీసుకుని అఘాయిత్యాలకు పాల్పడిన ఓ దొంగ బాబా బాగోతం బట్టబయలైంది. […]