మంచిర్యాల- సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్రాల్లో అంతా సందడిగా జరుపుకుంటున్నారు. చిన్నా పెద్దా అంతా కలిసి సంక్రాంతి స్పెషల్ పతంగులను ఎగురవేస్తున్నారు. ఐతే కైట్స్ ఎగురవేసే సమయంలో మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. పతంగులకు వాడే మాంజా దారం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. మాంజా దారం వాడొద్దని అధికారులు చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఆ నిర్లక్ష్యమే సంక్రాంతి పండగ రోజు ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. రోడ్డుపై తనదారిన తాను వెళ్తున్న అమాయకుడు బలైపోయాడు. […]