Road Accident: కాకినాడ సమీపంలోని యానాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి బాలయోగి బ్రిడ్జిపై టిప్పర్ లారీ ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.