‘కౌన్ బనేగా కరోడ్పతీ షో’ లో(KBC) పాల్గొనాలని, అమితాబ్ బచ్చన్ను ప్రత్యక్షంగా కలుసుకోవాలని రైల్వే ఉద్యోగి దేశ్బంధూ ఉబ్బితబ్బిబైపోతూ ముంబైకి వెళ్ళారు. ఆగస్టు 9వ తారీఖు నుంచి 13 వరకూ కేబీసీ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రూ. 3.2లక్షలు గెలుచుకుని సంబరపడిపోతూ ఇంటికి తిరిగొచ్చారు! కానీ ఆయనకు అదృష్టం అక్కడివరకే వెంటొచ్చింది. బిగ్ బీని కలిసిన ఆనందంలో ఇంటికొచ్చిన దేశ్బంధూ పాండే సంబరం ఎక్కువరోజులు మిగల్లేదు. రైల్వేశాఖ ఆయనకు భారీ ఝలక్ ఇచ్చింది. అనుమతిలేకపోయినా […]
అమితాబ్ కరోనా రోగులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఢిల్లీలోని రాకబ్ గంజ్ ప్రాంతంలోని గురుద్వారా ఆధ్వర్యంలో ఏర్పడనున్న కోవిడ్-19 సంరక్షణా కేంద్రానికి రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్ మీడియాకు తెలిపారు. రాకబ్ గంజ్లో ఏర్పాటు చేసిన కొత్త కరోనా సంరక్షణ కేంద్రం నేడు ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 300 పడకలను ఏర్పాటు చేసినట్టు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. అలాగే రానున్న […]