భారతీయ జనతా పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింల కంటే వీధి కుక్కలకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ ముస్లింలు బహిరంగ జైల్లో జీవిస్తున్నట్టే ఉందని వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ ఖేడాలోని ఉందేలా గ్రామంలో ముస్లింలపై పోలీసులు జరిపిన దాడుల్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. ముస్లింలు ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదని, మనకి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు మీ రోజు నడుస్తుంది, రేపు మా రోజు వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.
“గుజరాత్ లో దసరా సందర్భంగా నవరాత్రి గర్భా కార్యక్రమంలో రాళ్లు రువ్వారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముస్లిం వ్యక్తులను పట్టుకున్నారు. 300, 400 మంది ప్రజల ముందు వారిని దోషులుగా నిలబెట్టి.. స్తంభానికి కట్టి.. పోలీసులు లాఠీలతో కొడుతుంటే నినాదాలు చేశారు” అని ఒవైసీ అన్నారు. ముస్లింలను స్తంభానికి కట్టి కొరడాలతో కొడుతుంటే.. ప్రజలు ఈలలు వేస్తారు. ఇదేనా మన గౌరవం. ఈ సమాజంలో ముస్లింలకు గౌరవం లేదా? ఇదేనా మన పరువు? ఇదేనా మన దేశ రాజ్యాంగం? ఇదేనా లౌకికవాదం? ప్రాథమిక హక్కులంటే ఇవేనా? చట్టం అంటే ఇదేనా? చెప్పండి. రోడ్డు మీద ఉన్న కుక్కకి గౌరవం ఉంది. కానీ ముస్లింలకు గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ప్రధానమంత్రి.. మీరు గుజరాత్ కి చెందిన వ్యక్తి. గతంలో ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మీ స్వస్థలంలో ఈ దాడి జరిగింది. చెప్పండి. ఇదేనా రూల్ ఆఫ్ లా అంటూ ప్రశ్నించారు.
#WATCH | Wherever there is a BJP govt in the country it feels like Muslims are living in an open jail….There is more respect for the road dog than Muslims: AIMIM MP Asaduddin Owaisi at an event yesterday pic.twitter.com/qcJUctvFmf
— ANI (@ANI) October 9, 2022