రాజకీయాలకు దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఆ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించి విమర్శలకు గురయ్యారు. బాలకృష్ణ కూడా దీనిపై స్పందించి విమర్శల పాలయ్యారు. బాలకృష్ణ కామెంట్స్ కి వైసీపీ నాయకులు ధీటైన కౌంటర్లు ఇచ్చారు. వైసీపీ మంత్రులు, నేతలు లాజికల్ గా సమాధానమిస్తూ బాలకృష్ణపై కౌంటర్లు వేశారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నందమూరి కుటుంబ సభ్యులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా సందర్భంగా అమ్మ వారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. నందమూరి మనవళ్లకు మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మ వారిని ప్రార్ధించానని ఆయన వెల్లడించారు.
అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “దసరా పండుగ నాడు మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ నందమూరి వంశం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీ తాత గారు పెట్టిన పార్టీని లాక్కోండిరా నాయనా. ఆ నారా వారికి దానం చేయకుండా ఉంటే చాలు. మీ పార్టీని ఇప్పుడైనా సరే ఆ మనవళ్లు లాక్కోండి. ఎన్టీఆర్ కడుపున పుట్టిన కుమారులు వారి బావకి దాసోహం అయిపోయారు. కనీసం మనవళ్లు అయినా మావకి దాసోహం కాకండి. ఆ నందమూరి తారక రామారావు పేరు పెట్టుకుంటే కాదు. అట్లాంటి మహనీయుడి పేరు పెట్టుకున్నందుకు ఆయన పేరుని ఆ పార్టీలోకి తీసుకొచ్చే దానికి.. నందమూరి పార్టీ అనే దానికి ఒక అర్ధం తీసుకు రండి. ముందు దానికి శ్రీకారం చుట్టండి” అంటూ నందమూరి మనవళ్లపై కామెంట్స్ చేశారు.
నందమూరి మనవళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించా : అనిల్ కుమార్ యాదవ్#tdp #YSRCP pic.twitter.com/1u1Iwsh6b9
— News18 Telugu (@News18Telugu) October 7, 2022