ITDP: ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లటానికి అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నాయి. ఎప్పటి కప్పుడు అప్డేట్లు ఇస్తూ.. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇక, ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా, టీడీపీ అధికార ట్విటర్ ఖాతా ఐటీడీపీ చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పోస్టులో.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే ఏం జరిగి ఉండేదో రాసుకొచ్చింది.
ఇలా ఆ పోస్టులో మొత్తం 30 పాయింట్స్ ఉన్నాయి. ఆ 30 పాయింట్స్ ద్వారా ప్రభుత్వం ఏం చేయలేకపోయిందో.. తమ నేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చుంటే ఏం చేసేవాడో విపులంగా ఐటీడీపీ రాసుకొచ్చింది.