మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదృత వాతావరణంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పందించింది. టీడీపీ నాయకులు మాచర్లలో హింస సృష్టించారని తప్పుబట్టింది. టీడీపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డి ముందుగానే ప్లాన్ చేసుకుని కర్రలు, రాళ్లతో వచ్చి హింసకు పాల్పడడం సిగ్గు చేటని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. మాచర్లలో అల్లర్లు సృష్టించడంతో పాటు హింసకు ఆజ్యం పోసిన టీడీపీపై వైఎస్ఆర్సీపీ దాడి చేసిందని తెలిపింది. మాచర్లలో చోటు చేసుకున్న పరిస్థితులపై నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి స్పందించారు. పల్నాడులో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను ఆయన ఖండించారు.
డిసెంబర్ 16న తెల్లవారుజామున పల్నాడులో చెలరేగిన హింసాత్మక వాతావరణాన్ని ఆయన ఖండించారు. ఈ మాచర్ల ఘర్షణను ముందుగానే టీడీపీ ప్లాన్ చేసిందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఇమేజ్ ని దెబ్బతీయడానికి టీడీపీ ఇలాంటి హింసాకాండకు పాల్పడుతుందని ఆరోపించారు. పల్నాడు ప్రజల నుంచి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత టీడీపీకి ఇప్పుడు ప్రజల అటెన్షన్ కోసం ప్రభుత్వ ఇమేజ్ ని దెబ్బతీయాలని భావిస్తుందని అన్నారు. ఈ మొత్తం సామాజిక సామరస్యాన్ని నాశనం చేయడానికి టీడీపీ పన్నిన కుట్ర అని అన్నారు. టీడీపీ అగ్ర నేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లే.. కావాలని ఫ్యాక్షనిస్టులను పంపి గొడవ చేశారని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్యాక్షన్ సెంటిమెంట్లను టీడీపీ దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ‘ఇదేం కర్మ రా’ ప్రోగ్రాంకి వెళ్లే వారే ఐతే.. టీడీపీ కార్యాకర్తల చేతుల్లో కర్రలు, రాడ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. దీంతో క్లియర్ గా ఇది టీడీపీ కార్యకర్తలు చేసిన పనే అని అనడానికి ఇదే సాక్ష్యమని అన్నారు. పబ్లిక్ ప్రాపర్టీ, వాహనాలు, ఇళ్ళు ధ్వంసం అవ్వడానికి టీడీపీనే కారణమని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం రికార్డ్ అయ్యిందని.. మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై అధికారులు ఇన్వెస్టిగేట్ చేసి.. బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు.