బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 షో రెండోవారం మొత్తం ఎంతో ఎమోషనల్గా సాగిన విషయం తెలిసిందే. అందరు సభ్యులు తమ లైఫ్లో జరిగిన కొన్ని ఎమోషనల్ ఘటనలు, పిల్లలతో వారికి ఉన్న అనుబంధం, వారి జీవితంలో పిల్లలకు ఉన్న ఆవశ్యకతను వివరించండి అంటూ ఒక చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అందరూ వారి జీవితంలో జరిగిన ఎన్నో విషాద ఘటనలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వాటన్నింటిలో సీరియల్ ఆర్టిస్ట్ కీర్తీ భట్ మాటలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. కీర్తీ స్టోరీ ఇంట్లోని సభ్యులను మాత్రమే కాదు.. ప్రేక్షకులను సైతం ఏడించేసింది. ఆమె జీవితంలో జరిగినన్ని విషాదాలు మరొకరి జీవితంలో జరిగితే అసలు ఉండరేమో అనిపించేలా ఉంది.
కీర్తీ భట్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కారు ప్రమాదంలో కీర్తీ భట్ తల్లిదండ్రులు, అన్నావదినలు చనిపోయారు. బంధువులు అంతా వేధింపులకు గురి చేస్తే.. ఇంట్లో నుంచి పారిపోయి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ నానా ఇబ్బందులు పడి ఒక టెలికాలర్ ఉద్యోగం సంపాదించుకుంది. అక్కడి నుంచి ఎన్నో కష్టాలు పడి ఒక నటిగా ఎదిగింది. ఆమె జీవితంలో కాస్త సెటిల్ అయ్యాక ఒక చిన్న పాపను సైతం దత్తత తీసుకుంది. వేరే మనిషిని పెట్టి ఆ పాప బాగోగులు చూసుకుంటూ ఉంది. బిగ్ బాస్ కి వచ్చే ముందే ఆ పాప కూడా చనిపోయిందని చెప్పింది. అంతేకాదు.. యాక్సిడెంట్ సమయంలో తన గర్భాశయం తీసేశారని.. తను ఇంక జీవితంలో తల్లికాలేను అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ స్టోరీ విన్న ప్రేక్షకులు అంతా ఎంతో ఎమోషనల్ అయిపోయారు.
అయితే కీర్తీ జీవితంలో జరిగిన యాక్సిడెంట్, ఆమె కోమాలో ఉండటం అన్ని విషయాలను వాళ్ల సీరియల్ టీమ్ కూడా ఒక ఏవీ రూపంలో ప్రెజెంట్ చేశారు. తాజాగా కీర్తీ చెప్పిన వివరాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక కట్టు కథలా ఉందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కీర్తీ చెప్పిన స్టోరీ నమ్మశక్యంగా లేదనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ప్రమాదం జరిగి కాళ్లకు రాడ్లు వేశారు అని చెప్పింది. ఆమెని చూస్తే ఫిజికల్ టాస్కుల్లో దూసుకుపోతోంది, పరుగెడుతోంది. ఆమె కాళ్లకు రాడ్లు వేసినట్లు ఎక్కడా కనిపించడం లేదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. అయితే అదంతా నిజమే అయ్యుంటే కీర్తీ భట్ జీవితంలో చాలా లక్కీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి ఒంటరిగా జీవితంలో ఎంతో సాధించింది, మరెందరికో ఆదర్శం అంటూ ప్రశంసిస్తున్నారు. మరి.. కీర్తీ భట్ స్టోరీ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.