బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ రియాలిటీ షో ప్రస్తుతం రెండోవారం కూడా పూర్తి చేసుకునేందుకు సిద్ధమైంది. మొదటివారంతో పోలిస్తో.. రెండోవారం హౌస్ మొత్తం కాస్త ఎమోషనల్ గా సాగింది. రెండోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్కు కోసం ఇంటి సభ్యులతో సిసింద్రీ అనే గేమ్ ఆడించారు. ఆ గేమ్లో అందరికీ బొమ్మలు ఇచ్చి వాటిని కాపాడుకోవాలని కోరారు. అంతా ఆ బొమ్మలకు కనెక్ట్ అయిపోయారు. ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరుచుకున్నారు. గేమ్ అయిపోయిన తర్వాత ఆ బొమ్మలను తిరిగి ఇచ్చేయాలని కోరగా.. అంతా ఏడ్చేశారు. అది గమనించిన బిగ్ బాస్ వారికి బిడ్డలతో ఉన్న బంధాన్ని తెలిపాల్సిందిగా కోరాడు. అప్పుడు అందరూ తమ ఎమోషనల్ స్టోరీని చెప్పుకున్నారు. అందులో యూట్యూబర్ ఆదిరెడ్డి కూడా తన స్టోరీని షేర్ చేసుకున్నాడు.
“మా ఆవిడకి నా మీద ఇప్పటికీ కోపమే.. ఎందుకంటే నా కూతురు పుట్టే సమయంలో నేను ఆమె దగ్గర లేను. ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వాళ్లు ఏడిస్తే నేను చూడలేను. తర్వాత నా కూతురు పుట్టింది. అందరూ నా కూతురు కళ్లు తేడాగా ఉన్నాయన్నారు. నా చెల్లికి చూపులేదు. చూసిన వాళ్లంతా నా కూతురికి కూడా అలాగే వచ్చింది అంటూ మాట్లాడారు. ఆ మాటలు విన్న నేను తట్టుకోలేక పోయాను. వెంటనే విజయవాడ బయల్దేరాను. డాక్టర్ చెక్ చేసి ఆమెకు అలాంటి ఇబ్బది లేదు అని చెప్పిన తర్వాత నా భార్య- నేను ఎంతో సంతోషించాం. ఈ టాస్క్లో బొమ్మ ఇవ్వగానే తెలియకుండానే నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను” అంటూ ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.
ఇంక కెప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే.. నలుగురు కెప్టెన్సీ పోటీదారులుగా సెలక్ట్ అయ్యారు. చంటి, ఇనయా సుల్తానా, రాజశేఖర్, ఆర్జే సూర్యా గెలిచి కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే ఈ సారి ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్ కాకుండా.. ఓటింగ్ విధానం పెట్టారు. ఒక్కో పాట తర్వాత ఇద్దరు సభ్యులు ఒక టీమ్గా ఏర్పడి ఏకాభిప్రాయంతో ఒకరిని ఎంచుకోవాలి. ఈ ప్రక్రియలో మోడల్ రాజశేఖర్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. రెండోవారం బిగ్ బాస్ కెప్టెన్గా రాజ్ను ఎంపికచేశారు. ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది. బాలాదిత్య కెప్టెన్సీ టర్మ్ ముగిసి రాజ్ కెప్టెన్సీ స్టార్ట్ అయ్యింది. ఆదిరెడ్డి ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.