రష్మీ గౌతమ్.. బుల్లితెర యాంకర్గానే కాకుండా వెండితెర హీరోయిన్గా కూడా అభిమానులను సొంతం చేసుకుంది. ఒక్క జబర్దస్త్ యాంకర్గానే కాకుండా ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీకి కూడా హోస్ట్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. యాంకర్ రష్మీకి తెలుగు అంత బాగా రాకపోయినా కూడా టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు వేసే పంచ్లకు రివర్స్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ తన పరిధి దాటి మాట్లాడినట్లు కనిపించలేదు. ఉన్నతం కాస్త పద్ధతిగానే మాటలు చెబుతూ ఉంటుంది. కానీ, ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా కొన్నిసార్లు మాటలు దొర్లుతూ ఉంటాయి. అయితే వాళ్లు చేసేది ఫ్యామిలీ ఎంటర్టైనర్ షో అనేది మర్చిపోయి మాట్లాడితేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. యాంకర్ రష్మీ తాను ఏం మాట్లాడుతుందో తెలిసి మాట్లాడిందో.. తెలియక మాట్లాడిందో గానీ పెద్ద బూతు అయితే అనేసింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా అంటూ ఎపిసోడ్ నిర్వహించారు. అందులో స్కిట్స్, డాన్సులోత పాటుగా ఒక గేమ్ నిర్వహించారు. ఆ గేమ్ షో ఏంటి అంటే.. టేబుల్ మీద జూస్ గ్లాస్లు పెట్టారు. ఆ జ్యూస్ గ్లాస్లో వెండి, గోల్డ్ కలర్ కాయిన్స్ ని ఉంచారు. ఎవరికైతే వెండి కాయిన్ వస్తుందో వాళ్లు ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అదే గ్లాస్ గోల్డ్ కలర్ కాయిన్ వస్తే.. వారి జీవితం మొత్తం మీద ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అంటూ గేమ్ ప్లాన్ చేశారు.
అయితే ఆటో రాంప్రసాద్ గురించి అందరికీ తెలిసిందే. అప్పటికప్పుడు స్టేజ్ మీద జోకులు వేస్తూ ఉంటాడు. అలాగే యాంకర్ రష్మీ గేమ్ గురించి వివరించగానే.. రాంప్రసాద్ ఒక ప్రశ్న వేశాడు. అదేంటంటే.. సిల్వర్, గోల్డ్ కలర్ కాయిన్స్ ఉన్నాయి కదా.. ఒకవేళ జ్యూస్తో పాటుగా కాయిన్ మింగేస్తే ఏంటి పరిస్థితి అనే డౌటనుమానం వచ్చింది. అదే ప్రశ్నను రష్మీ అడిగాడు. ఒకవేళ కాయిన్ మింగేస్తే ఏంటి పరిస్థితి అని.. అందుకు రష్మీ ‘మీరు బయటకు మింగేయచ్చు’ అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఆమె ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా ఒక ఫ్యామిలీ షోలో ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఏంటి రష్మీ అంత మాట అనేసింది అంటూ నాలుక కరుచుకున్నారు. మొత్తానికి అందరికీ పంచులేసే రాంప్రసాద్ కి రష్మీ గౌతమ్ పంచు వేసింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.