నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. వివాహం అయిన నాలుగు నెలలకే వీరు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. కవల మగబిడ్డలకు తల్లిదండ్రులం అయ్యాం అంటూ విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే అందరూ షాకయ్యారు. అయితే సరోగసీ ద్వారా నయన్-విఘ్నేష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారని భావిస్తోన్నారు. ఆంగ్ల మీడియా కూడా సరోగసీ ద్వారానే నయనతార తల్లి అయినట్లు వార్తలు వెల్లడిస్తోంది. ఏది ఏమైనా తల్లిదండ్రులయిన నయన్, విఘ్నేష్లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ సరోగసీపై చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆమె పోస్ట్ చూసిన జనాలు.. సదరు హీరోయిన్ చేసిన ట్వీట్.. నయనతారను ఉద్దేశించే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్పై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఆ వివరాలు..
సీనియర్ హీరోయిన్ కస్తూరి తరచుగా ఏదో వివాదంలో నిలుస్తూనే ఉంటారు. కాంట్రవర్సీ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ.. తరచుగా వార్తల్లో నిలుస్తారు. ఈ క్రమంలో తాజాగా ఆమె సరోగసీ గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. ‘‘ఇండియాలో సరోగసీపై నిషేధం విధించారు వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప.. సరోగసీని ప్రోత్సాహించకూడదు. ఈ చట్టం జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాం’’ అంటూ కస్తూరి చేసిన ట్వీట్ ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. అయితే ఈ ట్వీట్లో కస్తూరి ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.
అయితే కస్తూరి చేసిన ట్వీట్ చూసిన జనాలు.. నయనతారను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసి ఉంటుందని భావిస్తోన్నారు. వారి జీవితం వారి ఇష్టం.. మధ్యలో మీకేందుకు.. ఇప్పుడు ఈ ట్వీట్ చేసి ఎవరిని బెదిరిస్తున్నారు.. పక్క వాళ్లు సంతోషంగా ఉంటే చూడలేరా అంటూ ఓ రేంజ్లో కస్తూరిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విమర్శలపై కస్తూరి స్పందిస్తూ.. మరో ట్వీట్ చేసింది. నా పని చూసుకో అంటూ చెప్పిన వారందరికి ఇదే నా సమాధానం. లాయర్గా అర్హత సాధించిన వ్యక్తికి చట్టపరమైన అంశాల గురించి విశ్లేషణ చేసే హక్కు ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు కస్తూరి.
Surrogacy is banned in India
except for medically inevitable reasons. This is the law from Jan 2022.
We are going to be hearing a lot about this for next several days.— Kasturi Shankar (@KasthuriShankar) October 9, 2022