సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు నయనతార. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచిపోయినా.. ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ ఏడాదే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నయనతార. దర్శకుడు విఘ్నేష్ శివన్తో ఏళ్లుగా ప్రేమలో ఉన్న నయన్.. తాజాగా ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న నయనతార.. ఆదివారం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తమకు కవల మగ పిల్లలు జన్మించారని ప్రకటించి.. అందరికి షాక్ ఇచ్చారు. విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్లో నయన్తో కలిసి చిన్నారుల పాదాలు ముద్దాడుతున్న ఫోటో పోస్ట్ చేశాడు. ఇది చూసిన వారు ఒకింత షాక్కు గురయ్యారు. వీరి వివాహం అయ్యి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే పిల్లలు పుట్టడం ఏంటి.. అదీ కాక.. నయన్ గర్భవతి అని ఎక్కడా ప్రకటన రాలేదు.. మరి ఇంత సడెన్గా తల్లిదండ్రులు కావడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఆఖరికి సరోగసి ద్వారా బిడ్డలని కని ఉంటారని అర్థం చేసుకున్నారు.
ఈ క్రమంలో విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్లో తాము కవల పిల్లలకు తల్లిదండ్రులమైనట్టు ప్రకటించాడు. చిన్నారుల పాదాలను నయనతార, తాను ముద్దాడుతున్న ఫొటోలను సైతం పోస్ట్ చేశారు. ‘‘నయన్, నేను అమ్మ, నాన్న అయ్యాం. మాకు కవల మగ బిడ్డలు జన్మించారు. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో మంచినంతా కలుపుకుని ఇద్దరు బిడ్డలు మాకు కలిగారు. వారికి మీ ఆశీస్సులు కావాలి’’ అని విఘ్నేష్ శివన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చిన్నారులకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు.
Nayan & Me have become Amma & Appa❤️
We are blessed with
twin baby Boys❤️❤️
All Our prayers,our ancestors’ blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for us❤️😇
Need all ur blessings for our
Uyir😇❤️& Ulagam😇❤️ pic.twitter.com/G3NWvVTwo9— Vignesh Shivan (@VigneshShivN) October 9, 2022
నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల తెలుస్తోంది. ఆంగ్ల మీడియా సైతం ఇదే విషయం వెల్లడించింది. ఇక వీరిద్దరూ ఏళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడానికి ముందే.. నయనతార, విఘ్నేష్ శివన్ పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నారట. ఈ క్రమంలోనే సరోగసీ ద్వారా పండంటి కవలలకు తల్లిదండ్రులు అయ్యారని తెలుస్తోంది. నయనతార వివాహం జూన్ 9న జరిగింది. వీళ్ళిద్దరూ ఏడు అడుగులు వేసి ఆదివారం (అక్టోబర్ 9) నాటికి సరిగ్గా నాలుగు నెలలు. ఇక పెళ్ళైన వెంటనే నయనతార, విఘ్నేష్ శివన్లు హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే.. నయనతార తాను హిందీలో షారుఖ్ ఖాన్ సరసన నటిస్తున్న ‘జవాన్’ షూటింగులో జాయిన్ అయ్యింది. ఇక తాజాగా విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.