ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో ‘పుష్ప’ దూసుకెళ్లింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమాకు ఓ రేంజ్ లో పాపులారీటి వచ్చింది. ఈ సినిమాలో పుష్పగా బన్నీ చేసిన మేనరిజమ్ అందరిని తెగ ఆక్టటుకుంది. క్రీడల్లో సైతం తగ్గేదేలే అంటూ కొందరు సెలబ్రిటీలు రచ్చ చేశారు. ప్రముఖుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు అందాయి. అయితే పుష్ప మూవీపై అప్పట్లో దర్శకుడు తేజ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ క్లారీటి ఇచ్చారు.
గతేడాది డిసెంబర్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. పుష్ప దెబ్బకి అనేక రికార్టులు సైతం తుడిచి పెట్టుకుపోయాయి. ఈ సినిమాలో పుష్పగా బన్నీ యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది. శ్రీవల్లి పాత్రలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటించి మెప్పించింది. పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా మేకర్స్ కూడా ఊహించని రేంజ్ లో హిట్ అందుకుంది. ఈ మూవీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని చోట్ల భారీ వసూలు రాబట్టింది. ఈ సినిమాను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. పుష్ప టీమ్ కి అభినందనలు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు తేజ మాత్రం ‘పుష్ప’ సినిమాని ప్లాప్ సినిమాగా అభివర్ణించాడని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై పెద్ద దుమారమే చెలరేగింది. బన్నీ ఫ్యాన్స్ తేజపై సోషల్ మీడియా వేదికగా ఏ రేంజ్ లో ట్రోల్స్ చేశారు.
అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై తేజ రీసెంట్ గా క్లారీటి ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం టిక్కెట్ రేట్ల వల్ల పుష్ప మూవీ బ్రేక్ ఈవెన్ ఆలస్యమైదని, అదే రేట్లు సరిగ్గా ఉండి ఉంటే బ్రేక్ ఈవెన్ త్వరగా అయ్యి ఉండేదని తేజ అన్నారు. టిక్కెట్ ధరలు పెరగడం వలన ఓ మాములు సినిమా కొన్ని చోట్లా లాభాలు చూపించిందన్నారు. తాను పుష్ప సినిమాను ఫ్లాప్ సినిమాగా అన్నలేదని, లాస్ వచ్చిందని మాత్రమే అన్నానని తెలిపారు. టిక్కెట్ రేట్ల వల్ల ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని మాత్రమే చెప్పానని తేజ వివరణ ఇచ్చాడు.
టిక్కెట్ రేట్లు సరిగ్గా ఉంటే.. పుష్ప సినిమాకి ఏపీలో ఇంకా భారీ లాభాలు వచ్చేవని, ఆ ఉద్దేశ్యంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని తేజ తెలిపాడు. “సుకుమార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాను ఎలా తీసినా నా వరకు నాకు బాగుంటుందనే అనుకుంటా. అయితే నా మాటలు కొందరికి అర్ధం కావు. వాటిని వక్రీకరిస్తారు. అదే పెద్ద సమస్య” అని తేజ అన్నారు. ప్రస్తుతం పుష్ప సినిమాపై తేజ ఇచ్చిన వివరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తేజ.. రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.