బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారం ఎంతో ఉత్కంఠగా మొదలైంది. నామినేషన్స్ నుంచి హౌస్లో హీట్ పెరిగిపోయింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కు ‘అడవిలో ఆట’ కొనసాగుతోంది. ఇంట్లోని సభ్యులను పోలీసులు- దొంగలు అంటూ రెండు గ్రూపులుగా విడగొట్టి పోటీ నిర్వహిస్తున్నారు. పోలీసులు అడవిని కాపాడుకోవాలి, దొంగలు అడవిలోని వస్తువులను దొంగతనం చేసి వాటిని వ్యాపారి(గీతూ రాయల్)కి అమ్మాలి. అయితే ఈ టాస్కులో ఏదీ బిగ్ బాస్ రూల్ ప్రకారం జరగడం లేదు. అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆడుకుంటున్నారు. ఆరోహీ రావ్ అయితే పోలీసులతో డీల్ పెట్టుకుంది. తనని వదిలేస్తే వాళ్లకు హెల్ప్ చేస్తాను అని. అలా ఎవరికి వాళ్లు డబుల్ గేమ్ ఆడటం ప్రారంభించారు.
గేమ్ విషయం పక్కన పెడితే హౌస్లో గ్రూపులు ఉన్నాయని అందరికీ తెలిసిందే. చంటి, సూర్య, ఫైమా, ఆరోహీ, నేహా, సుదీపా వీళ్లంతా ఒక టీమ్గా ఉంటే.. రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య వీళ్లు ఒక టీమ్గా ఉన్నారు. వీళ్లు కాక ఇంకా కొన్ని టీమ్లు కూడా ఉన్నాయి. ఇలా వీళ్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం, విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో చంటి కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. ఆ టీమ్లో ఏమున్నా అంతూ వచ్చి చంటికి చెబుతుంటారు. వాళ్లకి సలహాలు ఇవ్వడం, అప్పుడప్పుడు చంటి కూడా వ్యాఖ్యలు చేస్తుంటాడు. ముఖ్యంగా రేవంత్పై చంటి కామెంట్స్ చేయడం చూస్తున్నాం. అయితే తాజాగా ఆరోహీ రావ్పై చంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆరోహీ రావ్ హౌస్లో గేమ్ విషయంలో దూసుకుపోతోందనే చెప్పాలి. అయితే ఆమె ఒక మాట అంటే మాత్రం ఊరుకోదు. ఊరికే సీరియస్ అవుతుంది, కావాలంటే కయ్యానికి కూడా కాలు దువ్వుతుంది. అనాథగా పెరిగాను, నేను మనుషులను నమ్మను, ఎవరికీ ఎమోషనల్గా దగ్గర కాను అంటూ కామెంట్స్ చేయడం తెలిసిందే. అంతేకాకుండా హౌస్లో కూడా ఎవరికీ అంత క్లోజ్ కాకుండా ఆమె దూరం పెడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఆమె వ్యాఖ్యలపై చంటి రియాక్ట్ అయ్యాడు. “నేను 20 ఏళ్లు ఒక్క దాన్నే పెరిగాను. నేను ఎవరినీ దగ్గరకు రానివ్వను, నేను ఎవరినీ నమ్మను అని ఇంట్లో ఉన్న పది మందిని యాక్సెప్ట్ చేయలేని ఆమె రేపు కోట్ల మందిని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? సెలబ్రిటీ అంటే ఏంటి?” అంటూ చంటి సూర్యాతో మాట్లాడుతూ కామెంట్ చేశాడు. అయితే ఈ మాటలను ఏ ఉద్దేశంతో అన్నాడు? అందుకు గట్టి రీజన్ ఉందా అనేది తెలియాల్సి ఉంది. చలాకీ చంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.