MLA Kotamreddy Sridhar Reddy: “నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల చొప్పున ప్రతీ ఎమ్మెల్యేకు నిధులు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి” అంటూ ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. ఆ నిధులు ఎలాగూ వస్తాయన్న నమ్మకంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ జాబితాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు. తన సొంత నిధులతో నెల్లూరు రూరల్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్, యనమల వారి వీధిలో సందర్శించిన కోటంరెడ్డికి.. స్థానిక మహిళలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వీధుల్లో ఆకతాయిల బెడద ఎక్కువగా ఉందని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. దీనికి ఎమ్మెల్యే కోటంరెడ్డి అంగీకరించి వారికి హామీ ఇచ్చారు. తన సొంత నిధులు, స్నేహితుల సహకారంతో రూ. 30 లక్షల వ్యయంతో నెల్లూరు రూరల్ లో ప్రజలు కోరిన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రజల రక్షణ కోసం, నేరాలను అదుపు చేసేందుకు, పోలీసుల నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఇక నెల్లూరు రూరల్ పరిధిలో రోడ్ల నిర్మాణంపై కూడా ఆయన దృష్టి సారించారు. కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నా.. తన సొంత డబ్బులతో దగ్గరుండి మరీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఇతర నియోజకవర్గాల్లో కంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులు ముందుగా పూర్తవుతున్నాయి. ఇదొక్క విషయంలోనే కాదు.. ఆరోగ్యం సరిగా లేనివారికి, నిరుపేదలకు సొంత ఖర్చుతో వైద్యం చేయించడం, చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేయడం, గతంలో ఓ బాధితురాలికి కంటిచూపు వచ్చేలా చేయడం లాంటి పనులతో ఆయన సూపర్ పొలిటీషియన్ గా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మరి సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపడుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: CPI Narayana: CPI నారాయణకి చుక్కలు చూపించిన చిరంజీవి మహిళా అభిమాని!
ఇది కూడా చదవండి: Rashmika Mandanna: వైరల్ వీడియో.. డెలివరీ గర్ల్గా మారిన రష్మిక మందన్నా!