రెండు రోజుల క్రితం చిరంజీవి మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ.. చిరంజీవికి, మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడితో ఈ వివాదాన్ని వదిలేసి వరద బాధితుల కోసం కలిసి పనిచేద్దామని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు, అలానే బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. సీపీఐ నారాయణ కనబడగానే స్థానిక మెగాభిమానులు ఆయనపై విరుచుకుపడ్డారు.
రావులపాలెం వెళ్లిన నారాయణ.. పడవ ఎక్కి లంకలోకి వెళ్తుండగా మెగాభిమానులు బూతులు తిడుతూ ఆయన వెంటపడ్డారు. నారాయణ ఆల్రెడీ క్షమాపణలు చెప్పారని పక్కనున్న సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. మెగాభిమానులు వినకుండా నారాయణపై తిట్ల వర్షం కురిపించారు. లంక ప్రాంతం నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన్ను వదల్లేదు. ఆయనతో మహిళలు వాగ్వాదానికి దిగారు. “చిరంజీవి ఒక సంఘ సంస్కర్త, పద్మభూషణ్ చిరంజీవి అని తెలుసు, ఆయన మిమ్మల్ని ఎంత గౌరవించారో, జనసేన పార్టీ కూడా మీకు ఎంత గౌరవిస్తుందో మీకు తెలుసు. అలాంటిది మీ నుండి వ్యతిరేక మాటలు వస్తే మా మనోభావాలు దెబ్బతినవా” అంటూ నిలదీశారు. దీనిపై నారాయణ స్పందిస్తూ.. అందుకే తాను రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పానని గుర్తు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: CPI Narayana: చిరంజీవికి క్షమాపణ చెప్పిన CPI నారాయణ!
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం! వైద్యులు ఏం చెప్పారంటే?