రెండు రోజుల క్రితం సీపీఐ నారాయణ.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలను చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ హాజరైన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని కాకుండా.. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలిచి ఉంటే బాగుండేదని అన్నారు. అక్కడితో ఆగకుండా రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవిని విగ్రహావిష్కరణ రోజున వేదికపై ఆహ్వానించడం తగదని, చిరంజీవి ఒక బ్రోకర్ అని, చిల్లర బేరగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. అతనొక ల్యాండ్ మైన్ లాంటి వాడని, ఎప్పుడు, ఎక్కడ ఎవరి మీద పేలుతాడో తెలియని విధంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అటు మెగాభిమానులు, ఇటు జనసైనికులు ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు కూడా ఘాటుగానే స్పందించారు.
జనసైనికుల ప్రభావమో లేక మెగాభిమానుల ప్రభావమో తెలియదు గానీ మొత్తానికి సీపీఐ నారాయణ తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, మెగాభిమానులు ఈ వ్యాఖ్యలను మర్చిపోవాలని కోరారు. తాను వివాదాల జోలికి వెళ్లదలచుకోలేదని, ఇక ఈ వివాదం జోలికి ఎవరూ పోవొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను వాడిన పదాన్ని భాషా దోషంగా పరిగణిస్తున్నానని, రాజకీయ నేతగా చిల్లర బేరగాడు అనే పదం వాడానని తనను క్షమించాలని ఆయన కోరారు. చిరంజీవి రాజకీయ నేతగా ఉన్నారని, రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్ గా తీసుకోవాలని ఆయన అన్నారు. అయితే చిరంజీవి అభిమానులకు, కాపు నాడు సభ్యులకు నా వ్యాఖ్యలు బాధ కలిగించాయి ఆవేశం కలిగించాయి. కాబట్టి తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తపడుతున్నానని ఆయన అన్నారు. ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేయండి అంటూ దండం పెట్టారు. ఇప్పటి నుంచి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మరి నారాయణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఎంపీపై మహిళ ఫిర్యాదు..
ఇది కూడా చదవండి: Rajinikanth: రజనీ కథలో వేలు పెట్టడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయింది.. దర్శకుడి సంచలన వ్యాఖ్యలు