Rashmika Mandanna: ఇప్పుడు సౌత్ టు నార్త్ రష్మిక మందన్నా హవా నడుస్తోంది. భాష, ప్రాంతాలతో సంబంధంలేకుండా సినీ ప్రేక్షకులు ఆమెను అభిమానిస్తున్నారు. ఆమె అందానికి సరెండర్ అయిపోయారు. ‘నేషనల్ క్రష్’ అంటూ ఫ్యాన్స్ ఆమెకు పట్టం కూడా కట్టేశారు. ‘నేషనల్ క్రష్’ అన్న పేరుకు తగ్గట్టుగానే.. ఎక్కడ.. ఏ ఈవెంట్లో కనిపించినా.. రష్మిక అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన గ్రూమింగ్తో వ్వావ్ అనిపిస్తున్నారు. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా, రష్మిక మందన్నా ఫుడ్ డెలివరీ చేసిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మెక్డొనాల్డ్ ‘సెలెబ్రిటీ మీల్’లో భాగంగా డెలివరీ గర్ల్ అవతారం ఎత్తారు. ఆ వీడియోలో ఏముందంటే.. రష్మిక పుడ్ డెలివరీ గర్ల్గా మారి, స్కూటీ నడుపుకుంటూ వెళ్లి ఓ ఇంటికి పుడ్ డెలివరీ చేశారు. తమకు ఫుడ్ డెలివరీ చేసింది హీరోయిన్ రష్మిక అని తెలుసుకున్న ఇంట్లోని తల్లీకూతుళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. రష్మిక పర్మిషన్ తీసుకుని ఓ సెల్ఫీ కూడా దిగారు. ఈ వీడియో గత జనవరి నెలలో విడుదలైనప్పటికి.. మరో సారి వైరల్గా మారింది. కాగా, రష్మిక “పుష్ప” సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ఆమె హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే సౌత్ నుంచి బాలీవుడ్ అన్ని భాషల్లో నటించింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈక్రమంలో బాలీవుడ్ లో మంచి అవకాశాలు సంపాదించింది. ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`తోపాటు రణ్ బీర్ కపూర్తో కలిసి `యానిమల్` చిత్రంలో నటిస్తోంది. దీనికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఇక, తమిళ స్టార్ హీరో విజయ్ బైలింగుల్ సినిమా వారసుడులోనూ రష్మిక హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరి, నేషనల్ క్రష్ రష్మిక వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Ravi Teja: నేను అలాంటివాడిని కాదు.. రూమర్స్ నమ్మకండి : రవితేజ